బేగంపేట్ : ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. బేగంపేట్ డివిజన్కు చెందిన చంద్రశేఖర్, మల్లయ్యలు కొంత కాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు.
వైద్య ఖర్చుల నిమిత్తం నగదు కోసం బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరిశ్రీహరి సహాకారంతో సీఎం రిలీఫ్ ఫండ్కు ధరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చోరవతో బర్తన్ కంపౌండ్కు చెందిన చంద్రశేఖర్కు మంజూరైన రూ. 1లక్ష యాభై వేల చెక్కును వారి కుటుంబసభ్యులకు అందజేశారు.
అలాగే పాటిగడ్డ ఎంబీటీ నగర్కు చెందిన మల్లయ్యకు రూ.50వేల ఎల్వోసీ పత్రాన్ని బుధవారం మారేడ్పల్లిలోని మంత్రి తన నివాసంలో బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, నాయకులు శ్రీహరి, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.