బడంగ్పేట : పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ సర్వే నెంబర్ 119లో నిర్మాణం పూర్తయిన డబుల్ డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి చేతుల మీదగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు గౌరవ ప్రదంగా బతకడానికి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. మొదటి దశలో ఐదు బ్లాక్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఒక్కో బ్లాక్లో 16 ఇండ్లు ఉన్నాయని ఆమె తెలిపారు. 80 ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు లాటరీ పద్దతి ద్వారా కేటాయించడం జరిగిందన్నారు.
మిగతా వారికి ఇండ్లు పూర్తి కాగానే అందజేస్తామని ఆమె తెలిపారు. అర్హులైన వారికి తప్పకుండా ఇండ్లు వస్తాయన్నారు. గుడిసెలలో ఉన్న వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా2.84లక్షల ఇండ్లు 18వేల కోట్లతో నిర్మించడం జరుగుతుందన్నారు. మహేశ్వరం నియోజక వర్గానికి 20వేల ఇండ్లు మంజూరయ్యాయన్నారు.
కాగా రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రతి ష్టాత్మకంగా నిర్మాణం చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ముఖ్య మంత్రి కేసీఆర్ పేరు పెట్టుకోవాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కేసీఆర్ చేసిన మంచి పనిని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో కేసీఆర్ పోటో పెట్టుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండవలసిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, తాసీల్దార్ డి శ్రీనివాసరెడ్డి, మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డిఇఇ గోపినాథ్, స్థానిక కార్పొరేటర్ లీలా రవినాయక్, కార్పొరేటర్స్ అరుణ ప్రభాకర్రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, అక్కి మాదవి, అర్కల భూపాల్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నవీన్ గౌడ్, తీగల మాదవి సాయి నాథ్రెడ్డి, తదితరులు ఉన్నారు.