మనోహరాబాద్, జనవరి 13 : కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లో గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్ పూల అర్జున్, ఉప సర్పంచ్ మహేందర్గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు మహిపాల్, నాయకులు శేఖర్గౌడ్, నాగరాజు పాల్గొన్నారు.
చెరువులను పునరుద్ధరించిన ఘనత సీఎం కేసీఆర్దే
మనోహరాబాద్, జనవరి 13 : కనుమరుగవుతున్న చెరువులు, కుంటలకు పూర్వవైభవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదని మెదక్ జడ్పీ చైర్పర్సన్ అన్నారు. పర్కిబండలో సెహగల్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నీరు సంరక్షణ ప్రాజెక్ట్ ప్రోగాం కింద అల్లాయిచెరువులో చెరువు పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో అక్రమార్కులు చెరువులు, కుంటలను కబ్జాలు చేశారన్నారు. సీఎంఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుం టలను పునరుద్ధరించారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎం పీపీ విఠల్రెడ్డి, సర్పంచ్ అర్జున్, ఉపసర్పంచ్ క్యాతమ్మ, స్వచ్ఛంద సంస్థ మేనేజర్ సలావుద్దీన్ పాల్గొన్నారు.
ధరలు తగ్గించే వరకూ ఆందోళనల
-డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్
సంగారెడ్డి జనవరి 13 (నమస్తే తెలంగాణ) : కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు వ్యవసాయ రంగానికి గొడ్డలి పెట్టులాంటివని డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. కేంద్రం ఎరువుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు అన్నివిధాలుగా న్యాయం జరుగుతోందన్నారు. దేశంలో ఎక్క డా లేనివిధంగా రైతుబంధు ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేతలు ఎరువుల ధరలు పెంచడాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు.