చొప్పదండి, జనవరి 13: నియోజకవర్గంలోని ఆలయాల్లో గురువారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చొప్పదండి పట్టణంలోని శివకేశవాలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయంలో విష్ణువు, శ్రీదేవి-భూదేవి, పార్వతి-పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం నిర్వహించగా, భక్తులు తిలకించి పులకించిపోయారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. కల్యాణ మహోత్సవంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు దూస రాము, అర్చకులు జనగామ సత్యనారాయణ, సింహాచలం మురళి, ప్రభాకర్ పాల్గొన్నారు.
గంగాధర, జనవరి 13: మధురానగర్లోని శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకుడు కూర్మాచలం పవన్కుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం, పల్లకీ సేవ, పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. పూజల్లో సర్పంచ్ వేముల లావణ్య, నాయకులు వేముల అంజి, పెంచాల చందు, భక్తులు పాల్గొన్నారు.
రామడుగు, జనవరి 13: మండలంలోని వెలిచాల శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వీర్ల ప్రభాకర్రావు ఆధ్వర్యంలో గోదారంగనాథుల కల్యాణం జరిపించారు. అనంతరం రుక్మిణి, సత్యభామ సహిత శ్రీ వేణుగోపాలస్వామి నిత్య కల్యాణం నిర్వహించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గోపాల్రావుపేటలోని వేంకటేశ్వర, భవానీరాజరాజేశ్వర, సీతారామచంద్రస్వామి, అయ్యప్ప ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పలు ఆలయాల్లో గోదారంగనాథుల కల్యాణం జరిపించారు. వెదిరలోని వేంకటేశ్వర స్వామి, శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్లు వీర్ల ప్రభాకర్రావు, నార్ల రమేశ్, భక్తులు దొనపాటి సీతారాంరెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, కోట్ల మల్లేశం, కాసారపు బుచ్చిరాములుగౌడ్, కొండ శంకరయ్యగౌడ్, ఆలయ అర్చకులు డింగిరి సత్యనారాయణ చార్యులు, రమణాచార్యులు, దుర్శేటి రవికిరణాచార్యులు, సౌమిత్రి రామానుజాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జనవరి 13: కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో అర్చకుడు సుధాకరాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని, పూజలు చేశారు. పూజల్లో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, నాయకులు రమేశ్, శ్రీధర్, కూర నరేశ్రెడ్డి, కూర శ్యాంసుందర్ రెడ్డి, బలరాం గౌడ్, చింతల లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు. జూబ్లీనగర్ సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పూజల్లో సర్పంచ్ రుద్ర భారతి, భక్తులు రుద్ర రాములు, రమేశ్, మునిరెడ్డి, సంపత్, సంతోష్, మల్లేశం పాల్గొన్నారు. ఎలబోతారం మురళీకృష్ణ ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామి వారిని సర్పంచ్ కట్ల లక్ష్మి, ఎంపీటీసీ చల్ల రమక్క, నాయకులు గౌతమ్ రెడ్డి, లింగయ్య దర్శించుకొని, పూజలు చేశారు. చేగుర్తి వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుడు సముద్రాల వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో సర్పంచ్ చామనపల్లి అరుణ-రాజయ్య, ఎంపీటీసీ స్వరూప-చంద్రమోహన్, ఉపసర్పంచ్ గాండ్ల విజయ-అంజయ్య, ఆలయ కమిటీ సభ్యులు అశోక్గౌడ్, బాలయ్య, కిషన్, భక్తులు పాల్గొన్నారు. దుర్శేడ్ వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుడు మధుసూదనాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు తోట తిరుపతి, లక్ష్మి, నాయిని తిరుపతి, సతీశ్, రాజు, నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.