బండ్లగూడ : రోగుల సౌకర్యార్థం అంబులెన్స్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ను మేయర్ బుర్రా మహేందర్ గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు అంబులెన్స్ సేవలు వినియోగమౌతాయని తెలిపారు. మేయర్ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అంబులెన్స్ ఖర్చులను ప్యూర్ స్వచ్చంద సంస్థ, కార్పొరేషన్లు కలిసి భరిస్తాయన్నారు. అంబులెన్స్ సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, మేనేజర్ మనోహర్, కార్పొరేటర్లు చంద్రశేఖర్, రవీందర్రెడ్డి, నాయకులు పాపయ్య యాదవ్, సుమన్ గౌడ్, మాజీ సర్పంచ్ హరికృష్ణ, టీఆర్ఎస్ యువజన విభాగం అద్యక్షుడు మల్లేష్యాదవ్, అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభం
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా భవనం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు.