విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
చేవెళ్లలో రైతుబంధు వారోత్సవాలు
అలరించిన ఎడ్ల బండ్ల ర్యాలీ
చేవెళ్ల టౌన్, జనవరి 14: రైతుబంధుతో అన్నదాతలకు లాగోడి చింత తీరిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. చేవెళ్లలో శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సంక్షేమంలో అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్న మంచి మనసున్న మనిషి సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు రూ.50 వేల కోట్లు అందించిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు దండుగ అనుకున్న వ్యవసాయం.. నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో పండుగలా మారిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు.
రైతుల పక్షపాతి, మనసున్న మనిషిగా సీఎం కేసీఆర్ రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకంలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసి వారిని ఆదుకుంటున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె చేవెళ్ల మండల కేంద్రంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా ఎడ్లబండి ఎకి రైతులు, ప్రజలకు అభివాదం చేస్తూ, సీఎం కేసీఆర్కు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఇంద్రన్న విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే రైతుబంధు పథకం గొప్పదని, రూ.50 వేల కోట్లు రైతులకు అందించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతు బాంధవుడికి రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత మన సీఎంకే దక్కిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేసే ప్రతిపక్ష పార్టీల నాయకులకు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకా లు కనిపించడం లేదా అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో, దేశంలో ఎక డా లేని పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు నిండి నేడు భూగర్భ జలాలు పెరిగాయని, కాళేశ్వరం ప్రాజెక్టుతో 43 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నదని ఆమె గుర్తు చేశారు. రైతులందరికీ నేడు నాణ్యమైన విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందుతున్నాయన్నారు. రైతును రాజుగా చేస్తున్న సీఎం కేసీఆర్ దేశంలోనే ప్రథములని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్కు చేవెళ్ల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. రైతుబంధుతో రాష్ట్రంలోని రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు అండగా ఉండాలని సూచించారు. అనంతరం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, చేవెళ్ల జడ్పీటీసీ మర్పల్లి మాలతీకృష్ణారెడ్డి, మొయినాబాద్ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, టీఆర్ఎస్ చేవెళ్ల మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శివనీల, చేవెళ్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి హన్మంత్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, దేవుని ఎర్రవల్లి సర్పంచ్ మాణిక్యరెడ్డి, ముడిమ్యాల సర్పంచ్ స్వర్ణలతాదర్శన్, మల్లారెడ్డిగూడ సర్పంచ్ మోహన్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ ఘని, సివిల్ సైప్లె జిల్లా సభ్యుడు రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు నాగార్జునరెడ్డి, రాములు, శ్రీశైలం, శ్రీధర్రెడ్డి, రామాగౌడ్, రామేశ్వర్రెడ్డి, రాంరెడ్డి, రైతులు పాల్గొన్నారు.