జూబ్లీహిల్స్ : రహ్మత్నగర్ డివిజన్ వినాయక్నగర్ బస్తీలో ఇటీవల నూతనంగా నిర్మించిన స్వయంభు శ్రీలక్ష్మీనరసింహ స్వామి, అభయ అంజనేయస్వామి సహిత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ రూపొందించిన నూతన సంవత్సర 2022 క్యాలెండర్ను కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎస్.యాదగిరి, కె.సుధాకర్రెడ్డి, సీహెచ్ యాదగిరి, డి.ఆంజనేయులు, శ్రీశైలం యాదవ్, బస్తీ అధ్యక్షుడు సింగరి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, నాగరాజు, రవిశంకర్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.