మెహిదీపట్నం : వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ మైనారిటీ మాజీ సభ్యుడు, హ్యూమన్ రైట్ కౌన్సిల్ చైర్మన్ రాజారపు ప్రతాప్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారుజ ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో జాతీయ యువజన అవార్డులు పొందిన హైదరాబాద్ జిల్లాకు చెందిన నారా నాగేశ్వరరావు, భగవాన్ దాస్, సుధారాణిలను సన్మానించారు.
ఈ సందర్భంగా రాజారపు ప్రతాప్ మాట్లాడుతూ నేటి జనాభాలో 40 శాతం యువత ఉందని ప్రస్తుతం ఉపాధి అవకాశాలు అతి తక్కువ గా ఉండటం వల్ల నిరాశా నిస్పృహలకు లోనవడం విచారకరమని అన్నారు. కొద్దిరోజుల్లో యువత శక్తిని బలోపేతం చేయడానికి హెచ్ ఆర్ సి ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలతోపాటు పెద్ద ఎత్తున వారికి అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, అభిలాష్. రాజారపు ప్రభుదేవా తదితరులు పాల్గొన్నారు.