సూర్యాపేట టౌన్/రామగిరి, సెప్టెంబర్ 19 : దేశాన్ని వందల ఏండ్ల పాటు విదేశీయులు పాలించినప్పటికీ చెక్కుచెదరని సంస్కృతి మనది.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం ఏడేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధిని, అన్ని వర్గాల ఐక్యతను పెంపొందించుకున్నాం.. అన్ని మతాలను గౌరవించుకుంటూ సోదర భావం కలిగి ఉండడంలో మనకు మనమే సాటి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేదాంత భజన మందిరంలో, నల్లగొండ పాతబస్తీలోని హనుమాన్నగర్లో ఏర్పాటు 1వ నంబర్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొని గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోరాడి సాదించిన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేండ్లుగా అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రత్యేక విందులు, పండుగ సామగ్రిని అందిస్తున్నారని తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు, ప్రస్తుత పరిస్థితిని గురించి ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఏడాది నాటికి కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై గణేశ్ వేడుకలను మరింత సంబురంగా జరుపుకుందామని అన్నారు.
సూర్యాపేటలో శోభాయాత్ర వాహనాన్ని మంత్రి స్వయంగా నడిపించారు. క్రేన్ సహాయంతో చెరువులోకి దిగి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితాఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, మొరిశెట్టి శ్రీనివాస్, గుడిపూడి వెంకటేశ్వరరావు, తాహెర్ పాషా, శనగాని రాంబాబు గౌడ్, కొండపల్లి దిలీప్రెడ్డి, ఆకుల లవకుశ, వెంపటి సురేశ్, ఉత్సవ కమిటీ సభ్యులు అనంతుల కృపాకర్, రంగరాజు రుక్మారావు, చల్లమళ్ల నర్సింహతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, ఎస్పీ ఏవీ రంగనాథ్, గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నేతి రఘుపతి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లిరామరాజుయాదవ్, పీఎస్ కమిటీ సభ్యులు హఫీజ్ఖాన్, ఖలీం, టీఆర్ఎస్ నాయకులు నిరంజన్వలీ, సుంకరి మల్లేశ్గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, బకరం వెంకన్న, సింగం రామ్మోహన్, రావుల శ్రీనివాస్రెడ్డి, ఆలకుంట్ల మోహన్బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్రెడ్డి, ఆ పార్టీ నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నూకల నర్సింహారెడ్డి, సీపీఎం నాయకులు పుచ్చకాయల నర్సిరెడ్డి, స్థానికులు మామిడి పద్మ, ఝూన్సీపాల్గొన్నారు.