మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురువారం సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ. సాయన్నలు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మంత్రిని, ఎమ్మెల్యేలను ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయ, సహాకరాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, ఆలయ ఈఓ సుధాకర్, కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యాక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ ఆకుల హరికృష్ణ, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్, టీఆర్ఎస్ నాయకులు పిట్ల నాగేష్, సంతోష్, సదానంద్గౌడ్, నివేధిత, పెంటా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.