బడంగ్పేట: బడంగ్పేట మున్సిపల్కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్లో ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయంలో దశవతారాల విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణ, భక్తజనుల గోవిందనామస్మరణ నడుమ విగ్రహ ప్రతిష్టాపన చేయించారు.
ఈ కార్యక్రమానికి బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, కార్పొరేటర్ బండారి మనోహర్, వంగేటి ప్రభాకర్రెడ్డి, ఎర మహేశ్వరి జైహింద్ తదితరులు హజరై ప్రత్యేక పూజలు చేశారు. పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకు రావలసిన అవసరం ఉందని మేయర్ అన్నారు. ప్రజల్లో భక్తి విశ్వాసాలు పెరుగుతున్నాయన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కొలన్ క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.