గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్కుల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. అంబర్పేట డివిజన్ అనంతరాంనగర్ పార్కులో రూ.22 లక్షల వ్యయంతో చేపడుతున్న పార్కు సుందరీకరణ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.వియజ్కుమార్గౌడ్, జీహెచ్ఎంసీ డీఈలు సుధాకర్, సంతోష్ తదితరులతో కలసి ఆయన పరిశీలించారు.
అభివృద్ధి పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ముందుగా పార్కు ఆర్చ్ నిర్మాణం చేపట్టడంతో పాటు షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో పాటు పార్కు చుట్టూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించి పూర్తి స్థాయిలో సుందరీకరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
పనులను నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్వేత, రవి, టీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, దిలీప్, జాకీ, మహేశ్, ప్రవీణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.