దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఉన్న తపాస్పల్లి రిజర్వాయర్ను కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోకి మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తపాస్పల్లికి జలాలు తరలించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఇందుకోసం గ్రావిటీ లింక్ కాల్వల నిర్మాణానికి రూ.388.20 కోట్లు మంజూరు చేసింది. లింకు కాల్వలను నిర్మించి, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి, తపాస్పల్లి రిజర్వాయర్ నింపనున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదుల (చొక్కారావు ఎత్తిపోతల పథకం ) ఫేస్-2, 3 ద్వారా తపాస్పల్లి రిజర్వాయర్ను నింపుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 1,29,630 ఎకరాలకు సాగు నీరు అందనున్నది. వీటితో పాటు మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్ట ఆధునీకరణకు రూ.50.32 కోట్లు మంజూరు చేసింది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిధుల సేకరణ కోసం మంజీరా లిప్టు ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సర్కారు ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలు రానుండడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానున్నది.
సిద్దిపేట, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉత్తర తెలంగాణ వరప్రదాయిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలను నింపాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం లింకు కాల్వల నిర్మాణానికి గానూ రూ.388.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా లింకు కాల్వల నిర్మాణాన్ని చేపట్టి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలను తపాస్పల్లి రిజర్వాయర్ను నింపనున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదుల (చోక్కారావు ఎత్తిపోతల పథకం) ఫేస్-2, 3 ద్వారా తపాస్పల్లి రిజర్వాయర్ను నింపుతున్నారు. సీఎం కేసీఆర్ ఈప్రాంతానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో ఇక ఈ ప్రాంతం సస్యశ్యామలం కానున్నది. కాగా, దేవాదుల ద్వారా చేర్యాల మండలంలో 38వేల ఎకరాలకు, మద్దూరు మండలంలో 24వేల ఎకరాలకు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో 6వేల ఎకరాలకు సాగు నీరందించారు. కొండపాక మండలంలోని కొన్ని గ్రామాలకు సాగు నీరందించారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయనుండడంతో ప్రతి యేటా చెరువులను నింపవచ్చు. తపాస్పల్లి రిజర్వాయర్ సామర్థ్యం 0.3 టీఎంసీలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో 1,29,630 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. వీటితో పాటు మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్ట ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50.32 కోట్లు మంజూరు చేసింది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిధుల సేకరణకు మంజీరా లిప్టు ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వ నిర్ణయం.. హర్షణీయం..
చేర్యాల ప్రాంతానికి దేవాదుల ప్రాజెక్టు నీళ్లకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతం సస్యశామలమవుతుంది. రెండు దశాబ్దాలు గడిచిన కాలువల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో ఈ ప్రాంతానికి నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవ చూపి వాగులు వంకల సహాయంతో దేవాదుల నీరుతో చెరువులు నింపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఇబ్బందులు తప్పుతాయి. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి మద్దూరు తదితర మండలాలకు కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించినందుకు ఈ ప్రాంత రైతులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
బహుళ ప్రయోజనాలు కలిగిన రిజర్వాయర్
బహుళ ప్రయోజనాలు కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలు విడుదల చేయనున్నారు. దీంతో కరువు ప్రాంతంగా పిలువబడే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్నాయి. మల్లన్నసాగర్ నుంచి ఒకవైపు గేట్లు ఎత్తితే కొండపోచమ్మ, బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్లకు, మరో గేటు ఎత్తితే సింగూరు ప్రాజెక్టుకు, ఇంకో గేటు ఎత్తితే నిజాంసాగర్కు, మరో గేట్ ఎత్తితే మిషన్భగీరథ ప్రాజెక్టుకు వెళ్తాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఆలోచన చేయడంతో జిల్లా నలుమూలలకు గోదావరి జలాలు అందనున్నాయి. తపాస్పల్లి రిజర్వాయర్కు ఇది వరకు దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు వస్తున్నాయి. ఇక నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా తపాస్పల్లికి గోదావరి జలాలను విడుదల చేసేందుకు 0.75 కి.మీటర్ బండ్ వద్ద ఓటీ స్లూయిస్ను ఏర్పాటు చేస్తున్నారు. 0.3 సామర్థ్యంతో ఉన్న తపాస్పల్లికి నీళ్లు వెళ్తాయి. దీంతో నాలుగు మండలాలతో పాటు కొమురవెల్లి దేవస్థానం ఉన్నది. వీటికి ప్రయోజనం కలుగనున్నది. సిద్దిపేట, హుస్నాబాద్ నియోజకవర్గాలకు సైతం ఇక్కడి నుంచి నీళ్లు వెళ్లే అవకాశమున్నది. పెద్దవాగులోకి గోదావరి జలాలను విడుదల చేస్తే మూడు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కల్గుతుంది. కమలాయపల్లి చెరువు నుంచి నంగునూరు చెరువు మీదుగా పెద్దవాగులోకి పంపిస్తే ఘణపూర్ వద్ద కలుస్తాయి. ఇటు కమలాయపల్లి చెరువు నుంచి ధూళిమిట్ట, ఖాత, ఘణపూర్, అక్కెనపల్లి, పోరెడ్డిపల్లి, బస్వాపూర్, శనిగరం చెరువులోకి తీసుకెళ్లే అవకాశాలు సైతం ఉన్నాయి. ఫలితంగా మూడు నియోజకవర్గాలకు ఎంతో ప్రయోజనం కలగనున్నది.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కృషి అభినందనీయం
మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు నీటి సరఫరా చేసేందుకు ప్రత్యేక కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వెనుక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కృషి ఉంది. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి ఇతర ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించుకుపోతున్నారని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేశాయి. ఎక్కడో ఉన్న దేవాదుల ప్రాంత నుంచి పైపుల ద్వారా నీరు తపాస్పల్లికి చేరడానికి ఎన్నో వ్యయప్రయాసాలు ఉండేవి. ఇక పైభాగంలో ఉన్న మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లికి నీరు చేరడంతో సమయం, ఖర్చులు ఆదా అవుతాయి. ఇక 365 రోజుల పాటు తపాస్పల్లి రిజర్వాయర్లో నీటి లభ్యత ఉండేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే, మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
సర్కారుకు ప్రజలు రుణపడి ఉంటారు ..
మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు నీటిని మళ్లించేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక కృషితో తపాస్పల్లి రిజర్వాయర్కు మల్లన్నసాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటు కాల్వల నిర్మాణాలు తదితర వాటికి నిధులను మంజూరు చేయడంపై ఈ ప్రాంత రైతాంగం టీఆర్ఎస్ సర్కారు రుణపడి ఉంటుంది. కొమురవెల్లి మల్లన్న పేరిట నిర్మించి మల్లన్న సాగర్ నుంచి మల్లన్న కొలువైన ఉన్న కొమురవెల్లి మండలంలో ఉన్న తపాస్పల్లికి నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రుణపడి ఉంటాం.
కరువు నేల పచ్చబడుతుంది
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి తపాస్పల్లి రిజర్వాయర్లోకి నీళ్లు వదిలి, ఆ నీళ్లను కాల్వల నిర్మాణం ద్వారా చేర్యాల ప్రాంతానికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఒకనాడు కరువు నేలగా ముద్రపడిన మా చేర్యాల ప్రాంతం పచ్చబడుతుంది. సీఎం కేసీఆర్కు ఈ ప్రాంత పరిస్థితులు తెలుసు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంత రైతాంగానికి ఇది ఒక తీపి కబురు. తపాస్పల్లి నుంచి కాలువలను తవ్వించాలని గతంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా అంతంత మాత్రంగానే గోదావరి జలాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో కాళేశ్వరం జలాలతో మద్దూరు మండలంతో పాటు చేర్యాల, కొమురవెళ్లి, ధూళిమిట్ట మండలాల రైతాంగానికి సరిపడా సాగునీరందనుంది.