జిల్లాలో ఒక సర్పంచ్, 101 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు
ఈ నెల 3న వార్డుల వారీ ముసాయిదా.. ఎలక్టోరల్ జాబితా ప్రచురణ
12న తుది జాబితా ప్రచురణ
దుబ్బాక, మార్చి 31:వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నది. ఈ మేరకు వార్డుల వారి ఓటరు జాబితా తయారీ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఒక సర్పంచ్ స్థానం, 101 వార్డు సభ్యులు స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఈనెల 3న వార్డుల వారీ ముసాయిదా ఎలక్టోరల్ జాబితా ప్రచురిస్తారు. 6న జిల్లాస్థాయిలో, 7న మండల స్థాయిలో రాజకీయ నాయకులతో అధికారులు సమావేశం నిర్వహిస్తారు.12న తుది జాబితా ప్రచురించనున్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఉప ఎన్నికలు నిర్వహిస్తారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాక ఏర్పడ్డా సాధారణ, ఆకస్మిక ఖాళీలు, ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించక అర్హత కోల్పోయిన అభ్యర్థుల స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. వార్డుల వారి ఓటరు జాబితా తయారీ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 3న వార్డుల వారీ ముసాయిదా ఎలక్టోరల్ జాబితా ప్రచురణ, 12న తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 123 సర్పంచ్లు, 2,275 వార్డు మెంబర్లు, 58 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి, 101 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
జిల్లాలో గొడుగుపల్లి సర్పంచ్ స్థానానికి ..
సిద్దిపేట జిల్లాలో ఒకే ఒక సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి సర్పంచ్ స్థానం ఖాళీగా మారడంతో అక్కడ ఎన్నిక అనివార్యంగా మారింది. 2019 పంచాయతీ ఎన్నికల్లో గొడుగుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా రణం జ్యోతి విజయం సాధించారు. దౌల్తాబాద్ జడ్పీటీసీ స్థానం బీసీ మహిళ అవకాశం రావడంతో ఆమె జడ్పీటీసీగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం ఆగస్టు 2019లో సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో గొడుగుపల్లి సర్పంచ్ స్థానం ఖాళీ ఏర్పడడంతో ఎన్నిక జరగనుంది. దీంతో పాటు జిల్లాలో 101 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
జిల్లాలో ఖాళీగా ఉన్న వార్డుల వివరాలు
జిల్లాలో ఖాళీగా ఉన్న 101 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో అక్కన్నపేట మండలంలో అక్కన్నపేట 4వ వార్డు, రామావరం 5వ వార్డు, అంతక్కపేట 1వ వార్డు, చౌటుపల్లి 2వ, 7వ వార్డులు, గుడాటిపల్లి 3వ, 9వ వార్డులు, మైసమ్మవాగు తండా 8వ వార్డు, రేగొండ 7వ వార్డు, బెజ్జంకి మండలంలో వీరాపూర్ 1వ వార్డు, తోటపల్లి 9వ వార్డు, చేర్యాల మండలం చిట్యాల 10వ వార్డు, చుంచనకోట 2వ వార్డు, కాశ గుడిసేలు 3వ వార్డు , దౌల్తాబాద్ మండలంలో దౌల్తాబాద్ 5వ వార్డు, గువ్వలేగి 4వ వార్డు, గజ్వేల్ మండలంలో ఆరేపల్లి (ఎస్.బి) 4వ వార్డు, కొడకండ్ల 7వ వార్డు, హుస్నాబాద్ మండలంలో బంజేరుపల్లి 4వ వార్డు, గాంధీనగర్ 8వ వార్డు, జగదేవ్పూర్ మండలంలో చాట్లపల్లి 1వ, 3వ, 4వ, 6వ వారుల్డు, తీగులనర్సాపూర్ 7వ వార్డు, బస్వాపూర్ 3వ, 5వ, 6వ వార్డులు, బీజీ వెంకటపూర్ 1వ,4వ,6వ వార్డులు, చిన్న కిష్టాపూర్ 9వ వార్డు, ధర్మారం ,1,2,3,4,5,6,7,8 వార్డులు, డౌలాపూర్ 1, 2, 3, ,4, 6, ,8,9,10 వార్డులు, గొల్లపల్లి 4వ వార్డు, కొండాపూర్ 1, 2, 3, 4, 5,6,8 వార్డులు కొత్తపేట 8వ వార్డు, మందాపూర్ 2,3,4,7,8, మునిగడప 2,3,6,7,11,12 వార్డులు, రామచంద్రాపూర్ 2,3,4 వార్డులు, ఎల్లాయిగుడా 1,2,3,5,6,7,8, వార్డులు, కోహెడ మండలంలో చెంచెల చెర్వుపల్లి 3వ వార్డు, రామచంద్రాపూర్ 10 వార్డు, కొండపాక మండలంలో తిమ్మారెడ్డిపల్లి 2వ వార్డు, జప్తినాచారం 1వ వార్డు, మద్దూరు మండలంలో లింగాపూర్ 6వ వార్డు, రెడ్యానాయక్ తండా 3వ వార్డు, మర్కూక్ మండలంలో పాములపర్తి 5వ వార్డు, శివర వెంకటపూర్ 6వ వార్డు, ములుగు మండలంలో బస్వాపూర్ 2వ, 4వ వార్డులు, నంగునూరు మండలంలో రాంపూర్ 1వ వార్డు, రాయపోల్ మండలం చిన్నమాసన్పల్లి 8వ వార్డు, రాయపోల్ 10వ వార్డు, తిమ్మక్కపల్లి 6వ వార్డు, సిద్దిపేట రూరల్ పరిధిలో రాంపూర్ 5వ వార్డు, తోర్నాల 10వ వార్డు, సిద్దిపేట అర్బన్ పరిధిలో బక్రి చెప్యాల 1వ వార్డు, తడ్కపల్లి 3వ వార్డు, తొగుట మండలంలో పల్లెపహాడ్ 10వ వార్డు, ఎల్లారెడ్డిపేటలో 4వ, 7వ వార్డులు, వర్గల్ మండలంలో మజీద్పల్లి 1వ వార్డు, తునికి ఖల్సా 8వ వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఎన్నికల ప్రక్రియ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రాదేశిక , పంచాయతీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏప్రిల్ 3న వార్డుల వారీ ముసాయిదా ఎలక్టోరల్ జాబితా ప్రచురిస్తారు.
ఏప్రిల్ 6న జిల్లాస్థాయిలో ఖాళీ స్థానాలపై రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు సమావేశం నిర్వహిస్తారు.
7న మండల స్థాయిలో రాజకీయ నాయకులతో అధికారుల సమావేశం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 4 నుంచి 8 వరకు గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితా ప్రచురణ, జాబితలో అభ్యంతరాలు స్వీకరిస్తారు.
12 ఏప్రిల్న ఓటరు తుది జాబితా ప్రచురిస్తారు.
ఇవి కూడ చుడండి
రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
మహారాష్ట్రలో కొత్తగా 40 వేల కరోనా కేసులు.. 227 మరణాలు