అమీర్పేట్ : చదువుతో పాటు క్రీడలకు కూడా తగిన ప్రాముఖ్యతనిస్తూ యువతరం ముందుకు సాగాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అమీర్పేట్ జీహెచ్ఎంసీ మైదానంలో టీఆర్ఎస్ నాయకులు సచిన్, ముఖేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసాని క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి తలసాని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ క్రీడలపై కేంద్ర ప్రభుత్వం నుండి ఆశీంచిన మేర ప్రోత్సాహం ఉండడం లేదని విమర్శించారు. ఈ టోర్నమెంట్లో సత్తా చాటేందుకు వచ్చిన 85 క్రికెట్ టీమ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ.. క్రీడా స్పూర్తితో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ తలసాని సాయికిరణ్యాదవ్, నాయకులు వి.హనుమంత రావు, గులాబ్సింగ్ రాజ్పురోహిత్, అశోక్యాదవ్, సింగారపు శ్రీనివాస్ గుప్తా, బీ.ఆర్.నాయారణ రాజు, నిమ్మ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.