మణికొండ : రంగారెడ్డి జిల్లా న్యూ బీచ్ రెజ్లింగ్ చాంపియన్షిఫ్ టోర్నమెంటులో పాల్గొనే ఉత్తమ మల్లయోధుల ఎంపిక ఆదివారం నార్సింగి వీరాంజనేయ వ్యాయామశాలలో జరిగింది. ఈ సందర్బంగా 70కేజీల విభాగంలో జె.రాజు, 80కేజీల విభాగంలో డి.రంజిత్, 90 కేజీల విభాగంగలో ప్రకాష్సింగ్, జశ్వంత్గౌడ్లను ఎంపిక చేసినట్లు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి కె.క్రిష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ అసోసియేషన్ సభ్యులు నర్సింగ్రావు, నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ జి.వెంకటేష్యాదవ్, ఆంజనేయులు, సుధాకర్, ఆనంద్, పాండు, భగవాన్సింగ్, లక్ష్మణ్, యాదయ్య, శ్రీధర్ పాల్గొన్నారు.