ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల ఆశాజ్యోతి అని వక్తలు కొనియాడారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా ఉన్నది ఆయన మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుబంధు ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలోని హోల్సేల్ మార్కెట్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దానికి వివిధ ఆకులు, పూలతో చేసిన గజమాలను వేశారు.పొడవైన మెరుపుల కొవ్వొత్తులనువెలిగించారు. అనంతరం వారి చిత్రపటాలకుక్షీరాభిషేకం చేశారు.
ఖమ్మం వ్యవసాయం, జనవరి 16 : సబ్బండ వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని కేఎంసీ మేయర్ నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. రైతుబంధు ముగింపు ఉత్సవాలు ఖమ్మం రిటైల్ కూరగాయల మార్కెట్ వ్యాపారుల ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, పార్టీ నగర అధ్యకుడు పగడాల నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రిటైల్ కూరగాయల వ్యాపారులు తయారు చేసిన గజమాలను తొలుత సీఎం కేసీఆర్ నలభై అడుగుల కటౌట్కు వేశారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. దీంతో ఇప్పుడు రాష్టంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. సాగు చేపట్టిన తరువాత ఏ ఒక్క రైతూ నష్టపోవద్దని, ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే గొప్ప ఉద్దేశంతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పంటల పెట్టుబడి బాధ్యత సర్కారు తీసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ఏటా 3 లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక రైతు సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు సైతం తమ వద్ద అమలు చేసేందుకు చొరవ చూపుతున్నాయన్నారు. దీంతో తెలంగాణ సర్కారు పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చిరుమామిళ్ల కిరణ్కుమార్, తోట రామారావు, షేక్ షకీనా, డౌలే సాయికిరణ్, షేక్ ఉస్మాన్, శరత్నాయక్, రైతుబజార్ ఎస్టేట్ అధికారులు శ్వేత, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.