డీఆర్డీవో మధుసూదన్రాజు
చుంచుపల్లి, జనవరి 19 : ప్రతి మండలంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీవో మధుసూదన్రాజు అన్నారు. బుధవారం మండల అధికారులతో కలిసి పలు పంచాయతీల్లోని బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాలను పరిశీలించారు. త్రీ ఇైంక్లెన్, రుద్రంపూర్, పెనగడపలోని ప్రకృతి వనాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. త్రీ ఇైంక్లెన్ పంచాయతీలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి డ్రిప్ ఇరిగేషన్ పనులు, డ్రిప్ నడుస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో సకినాల రమేశ్, ఎంపీవో గుంటి సత్యనారాయణ, ఈజీఎస్ ఏపీవో రఘుపతి, ఈసీ నాగరాజు, టీఏ అనిల్, త్రీ ఇైంక్లెన్ సర్పంచ్ ఆంగోత్ మోతి, కార్యదర్శి పాషా, చెన్నకేశవులు, హనుమంతు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
బసవతారకం ప్రకృతి వనం పరిశీలన
పాల్వంచ, జనవరి 19 : పట్టణంలోని బసవతారకం కాలనీలో బృహత్ పల్లె ప్రకృతి వనానికి సంబంధించిన స్థలాన్ని ఎంపీడీవో రవీంద్రప్రసాద్, ఫారెస్టు రేంజర్ అనిల్ బుధవారం పరిశీలించారు. శ్రీనివాసగిరి గుట్టను ఆనుకొని ఉన్న ఈ ప్రదేశంలో నీటి వసతి ఉందని, మొక్కల పెంపకానికి కావాల్సిన అన్నిరకాల వసతులను పరిశీలించారు. ఈ నేలను చదును చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తరువాత మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. వారితోపాటు ఏపీవో రంగా, సిబ్బంది ఉన్నారు.