నిజాంసాగర్, జనవరి19 : మెదక్-రుద్రూర్ రహదారి నేషనల్ హైవే 765డీగా మారడంతో ఈ ప్రాంతంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు అతిథి గృహంలో ఉమ్మడి జిల్లాల జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి ఆర్డీవో, రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, నాయకులతో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేషనల్ హైవే నిజాంసాగర్ మండలం నర్వ గే టు నుంచి మహ్మద్నగర్, గున్కుల్, తున్కిపల్లి, బు ర్గుల్, మగ్దుంపూర్ ఆరు గ్రామాల శివారు మీదుగా బాన్సువాడ, రుద్రూర్ వరకు 95.27 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇం దుకోసం మెదక్-ఎల్లారెడ్డి వరకు రూ.250 కోట్లు, ఎల్లారెడ్డి-రుద్రుర్ వరకు రూ. 300 కోట్ల నిధులు మంజూరయ్యాయని, రెండురోజుల్లో సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. ఇందుకోసం భూసేకరణ చే యాల్సి ఉందన్నారు. రహదారి విస్తరణలో ఏ ఒక్కరికీ నష్టం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రహదారి మ్యాపును పరిశీలించారు. బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, నేషనల్ హైవే అథారిటీ డీఈ శ్రీనివాస్, ఏఈలు సతీశ్, శ్వేత, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో పర్బన్న, సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, వైస్ఎంపీపీ మనోహర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేశ్గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు ఉన్నారు.