ఎల్బీనగర్ : అందరివాడుగా ఉత్తమ సేవలు అందించిన గొప్ప నాయకుడు స్వర్గీయ రోశయ్య అని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. దివంగత రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ గొప్ప నాయకుడిని కోల్పోయామని అన్నారు. రాష్ట్రంలో 15 పర్యాయాలు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదని అన్నారు.