బడంగ్పేట : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంజార సంఘం నాయకులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ మాజీ వైఎస్ చైర్మన్ చిగిరింత నర్సింహరెడ్డి, కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ అధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని ఆదివారం కలిసి వినతి పత్రం అందచేశారు.
ఈ సందర్భగా వారు బంజార భవనం ఏర్పాటు చేయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ సూర్ణ గంటి అర్జున్ తెలిపారు. ఎక్స్ సర్వీస్ మెన్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి పరిష్కరిస్తానని మంత్రి అభయం ఇచ్చారన్నారు.
దేవాలయానికి స్థలం కేటాయించడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు
దేవాలయానికి స్థలం కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పలువురు రంగనాయకుల కాలనీ వాసులు మంత్రి సబితారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సబితారెడ్డి సూచనతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి 12వ డివిజన్లో ఉన్న రంగనాయకుల కాలనీలో శివాలయం నిర్మాణానికి 500 గజాల స్థలం కేటాయించారు.
దీంతో కార్పొరేటర్ యాతం పవన్ యాదవ్ ఆధ్వర్యంలో పి సబితా ఇంద్రారెడ్డిని ఆదివారం ఆమె నివాసంలో కలిసి పూల బోకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఉన్నారు.