టీఆర్ఎస గ్రామ కమిటీలు ఏర్పాటు
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 4 : గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయడానికి నూతన కమిటీలు కష్టపడి పనిచేయాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని దండుమైలారంలో శనివారం టీఆర్ఎస్ నూతన గ్రామ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడిగా మంగ ఐలేశ్, ప్రధాన కార్యదర్శి ఉక్కుల బాష, ఉపాధ్యక్షుడు ప్రకాశ్, సంయుక్త కార్యదర్శి నవీన్, కోశాధికారి బాలరాజు, కార్యవర్గ సభ్యులు లింగయ్య, జంగయ్య, నర్సింహను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీల ఇన్చార్జిలు డేరంగుల నర్సింహ, మంఖాల దాసు, గంగిరెడ్డి భాస్కర్రెడ్డి, సర్పంచ్ మల్లీశ్వరి, సహకారం సఘం చైర్మన్ వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహ, నాయకులు జగన్నాధం, జగదీశ్, వెంకటేశ్, కృష్ణ తదితరులున్నారు.
టీఆర్ఎస్ మున్సిపాలిటీ కమిటీల ఏర్పాటు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 4 : మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4, 5 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీలను శనివారం టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని ఎంఎం గార్డెన్లో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 1వ వార్డు అధ్యక్షుడిగా దేవరాశెట్టి అశోక్కుమార్, ప్రధాన కార్యదర్శి తలువ మహేశ్, 2వ వార్డు అధ్యక్షుడిగా గరిగె శేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఆరిఫ్, 3వ వార్డు అధ్యక్షుడిగా కొలుకులపల్లి రమేశ్, ప్రధాన కార్యదర్శిగా హనుమండ్ల యాదగిరి, 4వ వార్డు అధ్యక్షుడిగా మేడిపల్లి రఘు, ప్రధాన కార్యదర్శిగా యాచారం శ్రీకాంత్, 5వ వార్డు అధ్యక్షుడిగా కొండ్రు ప్రభు, ప్రధాన కార్యదర్శిగా ఎండీ నాయిడ్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అంజిరెడ్డి, నాయకులు మహేశ్గౌడ్, భీంరావు, రాజు, దయానంద్తో పాటు తదితరులున్నారు.
గడ్డమల్లాయగూడ అధ్యక్షుడిగా అచ్చన బీరప్ప
యాచారం, సెస్టెంబర్ 4 : మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి కార్యకర్తల సమావేశాన్ని పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి నిర్వహించి నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అచ్చన బీరప్ప, గౌరవ అధ్యక్షుడిగా జంగయ్య, కార్యదర్శిగా ధానయ్య, సంయుక్త కార్యదర్శిగా సురేశ్రెడ్డి, కోశాధికారిగా బాల్రాజ్, కార్యవర్గ సభ్యులగా జంగయ్య, అంజయ్య, కృష్ణ, పర్వతాలు, శ్రీనును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
లోయపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా జానయ్య
మంచాల సెప్టెంబర్ 4 : మండలం లోయపల్లి టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పాలకూర జానయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి బొట్టు రమేశ్, కోశాధికారిగా ఉయ్యాల జంగయ్య. ఉపాధ్యక్షులుగా భీముడు, లింగస్వామి, ప్రచార కార్యదర్శిగా రాజును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బద్రినాథ్ గుప్తా, జంగారెడ్డి, యాదయ్య, ఉయ్యాల కృష్ణ, ధనంజయ్య గౌడ్, ప్రవీణ్, వెంకటేశ్ గౌడ్, మారయ్య పాల్గొన్నారు.
గ్రామాల్లో నూతన కమిటీలు నియామకం
అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 4 : మండలంలోని కవాడిపల్లి, చిన్నరావిరాల, బలిజగూడ, గ్రామాల్లో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చక్రవర్తిగౌడ్ ఆధ్వర్యంలో బాటసింగారం సహకార బ్యాంక్ చైర్మన్ విఠల్రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరక్టర్ కిషన్గౌడ్, సీనియర్ నాయకుడు దేవేందర్గౌడ్ సమక్షంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీలను నియమించారు. కార్యక్రమంలో సర్పంచ్లు కిరణ్గౌడ్, వనజ, నాయకులు బాల్రాజ్గౌడ్, వీరస్వామియాదవ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
చింతపట్ల గ్రామాధ్యక్షుడిగా కె.జగన్
యాచారం, సెప్టెంబర్ 4 : మండలంలోని చింతపట్ల గ్రామ టీఆర్ఎస్ నూతన కమిటీని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా కె.జగన్, ఉపాధ్యక్షుడిగా రాజీవ్, కార్యదర్శిగా శంకర్, సంయుక్త కార్యదర్శిగా దేవేందర్, కోశాధికారిగా నర్సింహ, సభ్యులుగా శ్రీశైలం, నర్సింహ, లక్ష్మమ్మ, శ్రీను, భాస్కర్రెడ్డి, పుష్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదయ్య, యాదయ్యగౌడ్, లక్షీపతిగౌడ్, శివ, నరేందర్, రవి పాల్గొన్నారు.