మణికొండ : తెలంగాణలోనే ప్రాచుర్యం పొందిన నార్సింగి వ్యవసాయ మార్కెట్యార్డును సమిష్టి కృషితో అభివృద్ది పర్చుకోవాలని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ దూడల వెంకటేష్గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ నార్సింగి పశువుల సంతలో వేలాది రూపాయల వ్యాపారాలు జరుగుతున్నప్పటికీ వ్యాపారులు సకాలంలో మార్కెట్ ఫీజులు చెల్లించకపోవడం సరికాదన్నారు. మన మార్కెట్ను అందరం కలిసికట్టుగా అభివృద్ది పర్చుకోవాలని సూచించారు.
మార్కెట్ యార్డులో ప్రజలకు అవసరమైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం తరుపున నిధులను మంజూరుచేయడం జరిగిందని చిన్న చిన్న సమస్యల కారణంగా అభివృద్ది కుంటుపడుతోందన్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం సమిష్టిగా అభివృద్ది కోసం పాటుపడాలన్నారు.
ఇప్పటికే మార్కెట్యార్డులో సీసీరోడ్లు, నూతన భవన నిర్మాణంతో పాటు వ్యాపారులకు అవసరమైన వసతులను కల్పించడం జరిగిందన్నారు. నార్సింగి మార్కెట్కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రజాప్రతినిధులు అంతా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ జి.వెంకటేష్యాదవ్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్గౌడ్, వైస్ చైర్మన్ మేకల ప్రవీణ్యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.