కచ్చితమైన పరిమాణంలో బొగ్గు రవాణా చేసేందుకు ప్రీ వేబిన్ బంకర్లకు సింగరేణి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీహెచ్పీలో రెండున్నరేళ్ల క్రితం దీనిని ప్రారంభించింది. ఈ క్రమంలో సుమారు వందల కోట్ల అదనపు ఆదాయం సంస్థకు లభిస్తున్నదని అధికార యంత్రాంగం చెబుతున్నది. దీంతో పాటు సమయం, మానవనిర్వహణ కూడా తగ్గడంతో మరింత కలిసివస్తున్నదని స్పష్టం చేస్తున్నది.
రామవరం, జనవరి 16 : వినియోగదారులకు కచ్చితమైన పరిమాణంలో బొగ్గు రవాణా చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రీ వే బిన్ బంకర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీహెచ్పీలో (రుద్రంపూర్ కోల్ హ్యాండ్లిం గ్ ప్లాంట్) ప్రివేబిన్ బంకర్ల నిర్మాణ పనులు పూర్తిచేసి రైల్వే జీఎం గజానన్ మాల్యా చేతుల మీదుగా సెప్టెంబరు 6, 2019లో ప్రా రంభించారు. సుమారు రూ. 4.50 కోట్ల వ్యయంతో రెండు బంకర్లను నిర్మించారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని, 5 షాప్టు, జీకేవోసీ, జేవీఆర్వోసీల్లో ఉత్పత్తి చేసిన బొగ్గును ఆర్సీహెచ్పీకి తరలిస్తుంటారు. అక్కడి నుంచి రైలు, రోడ్డు రవాణాద్వారా బొ గ్గును చేరవేస్తారు. గతంలో ఆర్సీహెచ్పీలో ఉన్నటువంటివి మ్యాన్యువల్ బంకర్లు. దీని ద్వారా రైల్వే వ్యాగన్లలో లోడింగ్ చేసేవారు. మ్యాన్యువల్ బంకర్లతో కొన్ని సందర్భాల్లో ఓవర్ లోడింగ్, అండర్ లోడింగ్ జరుగుతుండేది. ఓవర్ లోడింగ్ అయితే రైల్వేశాఖ అధికారులు అదనపు చార్జీలు వసూలు చేసేవారు. అం డర్ లోడింగ్ జరిగితే వినియోగదారుడు అగ్రిమెంట్ ప్రకారం కాకుండా తరుగుదలను తీసి బిల్లును చెల్లించేవారు. దీంతో సంస్థ అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుండేది. సంస్థ ఈ నష్ట నివారణ చర్యలను పూడ్చడం కోసం ప్రీ వే బిన్ బంకర్లను నిర్మించింది. ప్రస్తుతం ఇవి అందుబాటులోకి రావడంతో కచ్చిత పరిమాణం లో బొగ్గు రవాణా కావడమే కాకుండా వినియోగదారుడి నుంచి ప్రీవేబిన్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. దీంతో సంస్థకు నష్టం వాటిల్లడం లేదు.
ఇప్పటివరకు జరిగిన రవాణా..
26 సెప్టెంబర్ 2019 నుంచి 31 మార్చి 2020 వరకు 1296 రే కులద్వారా(రేకు అంటే 59 రైల్వే వ్యాగన్లు) 4944788.75 ట న్నులపై (ప్రీ వే బిన్ చార్జి టన్నుకు 50 రూపాయలు అదనపు ఆ దాయం) రూ.24.72 కోట్లు ఆదాయం వచ్చింది. 1 ఏప్రిల్ 20 20 నుంచి 31/03/2021 వరకు 1995 రేకులు 79,60, 561 టన్నులకు రూ. 39.80కోట్లు 1 ఏప్రిల్ 2022 వరకు 1789 రే కులతో 72,26,795.86 టన్నులకు రూ. 36.13 కో ట్లు మొ త్తం 5080 రేకులు 20132146.20 టన్నులకు మొత్తం ఆదా యం రూ.100.66 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.
రోజుకు 30వేల టన్నుల బొగ్గు రవాణా
బొగ్గు రవాణాలో కొత్తగూడెం ఏరియా ముందువరుసలో ఉం టుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఏరియా లో ప్రీవేబిన్ ద్వారా రోజుకు 30వేల టన్నుల బొగ్గు రవాణా చేస్తూ మన్ననలను పొందుతున్నది. ఇటు రైల్వేకు ఓవర్లోడింగ్ చార్జీ లు, వినియోగదారుడికి డ్యామరేజ్ చార్జీలు కట్టాల్సిన అవసరం లేకుండా సంస్థకే లాభాలు వచ్చే విధంగా ప్రీవేబిన్ బంకర్ ఉపయోగపడుతున్నది.
ప్రీవేబిన్తో సంస్థకు లాభాల పంట
ప్రీ వే బిన్ ఏర్పాటుచేసిన తరువాత ఇప్పటివరకు సుమారు వందకోట్ల అదనపు ఆదాయం వచ్చింది. కచ్చితమైన పరిమాణంలో బొగ్గు రవాణా చేస్తున్నాం. రైల్వే శాఖ నుంచి ఓవర్ లోడింగ్ ఫైన్లు కూడా తప్పించుకోగలుగుతున్నాం వినియోగదా రుడికి కూడా బొగ్గును అండర్ లోడింగ్ లేకుండా అందించగలుగుతున్నాం. ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు పర్యవేక్షణ, ప్రోత్సాహం, అధికారులు, కార్మికులు, ఉద్యోగుల సమష్టి కృషితో ఆర్సీహెచ్పీ రవాణాలో ముందు వరుసలో ఉండడం సంతోషంగా ఉంది.
-వీ వెంకటేశ్వర్లు, డీజీఎం, ఆర్సీహెచ్పీ