ఆర్కేపురం : సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిబా పూలే 131 వ వర్ధంతిని పురస్కరించుకోని సరూర్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్లో ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధిశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ ముద్దగోని రామ్మోహన్గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి తన జీవితాన్ని సైతం త్యాగం చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహోన్నత వ్యక్తి పూలే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, చింతలబాల్రాజు, ఆనంద్ కుమార్, మల్లేష్,వెంకటేష్గౌడ్, పాషా,లోడి నర్సింహాగౌడ్, పల్లె వినయ్ కుమార్, శ్రీశైలంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.