బండ్లగూడ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై రాజేంద్రనగర్ పోలీసులు దాడి చేసి నిర్వహకురాలితో పాటు నలుగురు యువతులు,ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బాలరాజ్ తెలిపిన వివరాల ప్రకారం..
బండ్లగూడ పిఅండ్టీ కాలనీలోని ఓ అపార్ట్ మెంటులో గత కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం తో పోలీసులు శుక్రవారం అ ఇంటిపై దాడి చేసి ముగ్గురు అమ్మాయిలతో పాటు నిర్వహకురాలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.