హిమాయత్నగర్ : బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం సేవలు అందించిన పేదల పెన్నిది పీజేఆర్ అని ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పి.జనార్ధన్రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణగూడ వెంకటస్వామినగర్ బస్తీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీజేఆర్ చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. విజయారెడ్డి మాట్లాడుతూ పేదలకు నిత్యం అందు బాటు లో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన మహానీయుడు పీజేఆర్ అని, ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియాడారు.
తన తండ్రి పీజేఆర్ చూపిన బాటలో నడుస్తూ గత 14 ఏండ్లుగా పలు సేవా కార్య క్రమాలు చేస్తున్నట్లు ఆమె చేప్పా రు.సమాజంలోని ప్రతి పౌరుడు కంటి సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయ కుండా వైద్యులను సంప్రదించి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ నేత్ర వైద్య శిబిరంలో 320 మందికి కంటి పరీక్షలు చేయగా ఇందులో 200 మందికి కండ్ల అద్దాలను విజయారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ కంటి దవాఖాన డాక్టర్స్ ఎన్.లక్ష్మినారాయణ, శాలిని, టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్గౌడ్, కె.శ్రీకాంత్, నరేష్, కమల,యాస్మీన్, ప్రవీణ్, రామకృష్ణ, తాజ్ఖాన్ అజమ్హాజీ తదితరులు పాల్గొన్నారు.