ఉస్మానియా యూనివర్సిటీ : భారత నాస్తికోద్యమ పితామహుడు పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ 48వ వర్ధంతిని వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల ఆవరణలో గురువారం వేర్వేరుగా ఘనంగా నిర్వహించారు.
దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ ఆధ్వర్యంలో జేఏసీ కార్యాలయంలో పెరియార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆధునిక కాలపు కుల, మతవ్యవస్థపై అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా స్త్రీ విముక్తికై కూడా ఉద్యమించారని గుర్తు చేశారు.
ద్రవిడ ఉద్యమాన్ని తన భుజస్కంధౠలపై వేసుకుని ముందుకునడిపారని కొనియాడారు. దక్షిణ భారతీయుల ఆత్మగౌరవమైన ప్రాంతీయ భాషలకు వ్యతిరేకంగా ఉన్న హిందీ భాషా వ్యతిరేక ఉద్యమాన్ని నడిపారని ప్రశంసించారు. పెరియార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు క్రాంతిరాజ్, రహమాన్, శ్రీకాంత్, దివాకర్, ప్రశాంత్, అజయ్, ఉమేశ్, శ్రీనివాస్, భవాని, శిరీష, రాల్ తదితరులు పాల్గొన్నారు.