కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 9: మండలంలో కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కోరారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయన పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో కొవిడ్ నిబంధనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, గ్రామాల్లో 45 ఏళ్లుపైబడిన వారు టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తహసీల్దార్ నల్ల వెంకట్రెడ్డి మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ బృందం పని చేస్తుందని తెలిపారు. ఎంపీడీవో పవన్కుమార్, పీహెచ్సీ వైద్యుడు వంశీ, ఎంఈవో మధుసూదన్, ఎంపీవో రాజగోపాల్రెడ్డి, సర్పంచ్ రమణారెడ్డి తదితరులున్నారు.
కొవిడ్ టీకా వేసుకోవాలి
కొత్తపల్లి, ఏప్రిల్ 9: మండలంలో 45 ఏళ్లుపైబడిన వారు కొవిడ్ టీకా వేసుకోవాలని తహసీల్దార్ చిల్ల శ్రీనివాస్ సూచించారు. కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, మండలంలో కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ర్యాలీలు, పండుగల నిర్వహణకు ఈనెల 30వ తేదీ వరకు అనుమతి ఇవ్వవద్దని సూచించారు. వైద్యాధికారి వంశీకృష్ణ మాట్లాడుతూ, 45 ఏళ్లు దాటిన వారు టీకా వేసుకోవాలని కోరారు. ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్ మాట్లాడుతూ మండలంలో కరోనా జాగ్రత్తలపై ప్రజా ప్రతినిధులతో కలిసి పోస్టర్లు, ఫ్లెక్సీలతో అవగాహన కల్పిస్తామని తెలిపారు. జడ్పీటీసీ పిట్టల కరుణ, ఖాజీపూర్ సర్పంచ్ ఇల్లెందుల రాజమ్మ, ఎంపీటీసీలు దావ కమలామనోహర్, ఇన్చార్జి ఎంపీడీవో సంపత్కుమార్, పంచాయతీ కార్యదర్శులు రేవంత్రెడ్డి, పద్మ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఒంటిమిట్టలో 26న కోదండ రాముడి కల్యాణం
జూమ్ క్లాస్ నుంచి స్టూడెంట్ డిటెన్షన్