బంజారాహిల్స్ : కరోనా మహమ్మారి ఉదృతి సమయంలో దేశవ్యాప్తంగా ఎదురయిన ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకుని అలాంటి పరిస్థితి తిరిగి ఎదురుకావద్దనే ఉద్దేశ్యంతో బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో అక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
గురువారం ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అత్యాధునిక ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..రూ.1.2కోట్ల వ్యయంతో ప్రముఖ ఫార్మాసంస్థ నోవార్టిస్ సంస్థ సహకారంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు.
నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ఈ ఫ్లాంట్తో ఆస్పత్రిలోని రోగులకు ఎంతో ప్రయోజనం ఉంటుంద న్నారు. ఇటీవల కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్కపోవడంతో దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ఆస్పత్రిలో అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు అత్యాధునిక ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు.
గతంలో కూడా నోవార్టిస్ సంస్థ ఆస్పత్రి అభివృద్ది కోసం రూ.3.5కోట్లు విరాళం అందజేసిందని బాలకృష్ణ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో డా.ఆర్వీ ప్రభాకర్రావు, మెడికల్ డైరెక్టర్ డా.టీఎస్.రావు, మెడికల్ సూపరెండెంట్ డా.ఫణి కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.