రాష్ట్రంలో కొలువుల కుంభమేళా కొనసాగుతున్నది. యువతీ,యువకులు ఉద్యోగమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. మైదానాలు, గ్రంథాలయాల్లో సందడి కనిపిస్తున్నది. ఇప్పటికే పోలీసుశాఖ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీ నుంచి ఖమ్మం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. సీపీ విష్ణు ఎస్ వారియర్ పర్యవేక్షణలో వచ్చేనెల 3 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. సాంకేతికతను వినియోగించి పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలకు 24,733 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. పురుషులు 20,033, స్త్రీలు 4,735 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్కు 3,946 మంది మహిళలు హాజరు కాగా 2,556 మంది, 13,496 మంది పురుషులకు 7,361 మంది తుది పరీక్షలకు ఎంపికయ్యారు.
మామిళ్లగూడెం, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేస్తుండడంతో యువత ఉత్సాహంగా సాధన చేస్తున్నారు. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ైస్టెఫెండరీ కేడెట్ ట్రైయినీ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను పూర్తి చేశారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ పర్యవేక్షణలో వచ్చేనెల 3 వరకూ కొనసాగనున్నాయి. పోలీసు ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు 24,733 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. వీరిలో పురుషులు-20,033 మంది, స్త్రీలు-4,735 మంది ఉన్నారు. ఈ 18 రోజుల్లో మహిళలకు నాలుగు రోజులు ఈవెంట్స్ జరిగాయి. మొత్తం 3,946 మంది హాజరు కాగా 2,556 మంది సత్తా చాటి తుది పరీక్షలకు ఎంపికయ్యారు. అలాగే 14 రోజులపాటు పురుషులకు జరిగిన ఈవెంట్స్లో 15,474 మంది అభ్యర్థులకు గాను 13496 మంది హాజరయ్యారు. వారిలో 7,361 మంది తుది పరీక్షలకు ఎంపికయ్యారు.
పోలీసు ఉద్యోగ నియామకాల ఎంపికల్లో గత ప్రభుత్వాలు అనుసరించిన తప్పుడు విధానాలతో అభ్యర్థులకు ఎన్నో అపోహలుండేవి. ప్రధానంగా రాత పరీక్షల దగ్గర నుంచి ఈవెంట్స్ వరకు గతంలో ప్రభుత్వ పెద్దల సహకారంతో దొడ్డిదారిన నియామకాలు జరిగేవని అభ్యర్థులకు అనుమానం ఉండేది. ఇలాంటి అపోహలు, అనుమానాలకు తావులేకుండా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంకేతిక విధానాలను అవలంబిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తోంది. ఎంపికల్లో అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయాన్ని స్పష్టంగా రికార్డు చేసేందుకు ప్రతిఒకరికీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ (ఆర్ఎఫ్ఐడీ)తో కూడిన జాకెట్, చేతికి బ్యాండ్ అమర్చుతున్నది. అభ్యర్థుల కోసం పరేడ్ గ్రౌండ్లో మొబైల్ టాయిలెట్లు, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరుగు పందెంలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే మిగతా ఈ వెంట్స్కు అనుమతిస్తున్నారు.
పురుషులు 1,600 మీటర్లను 7.15 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 800 మీటర్లు 9.30 నిమిషాల్లో పూర్తి చేయాలి. పురుషుల్లో సుమారు 16 శాతం, మహిళల్లో సుమారు 3 శాతం మంది పరుగు పందెంలో విఫలమవుతున్నారు. ఎత్తు కొలతలను కొలిచే సందర్భంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు పాదాలు పూర్తిగా పరికరంపై తాకితేనే పైనున్న సెన్సార్ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటుంది. పురుషులు 167.6 సెంటీమీటర్లు, మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుష అభ్యర్థులు 160 సెం.మీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు 150 సెం.మీ ఎత్తు ఉండాలి. పరుగుపందెలో అర్హత సాధించిన వారిని షాట్పుట్కు పంపుతున్నారు. ఆ విభాగంలో పురుషులు 7.26 కిలోల బరువును 6 మీటర్లు, మహిళలు 4 కిలోల బరువును 4 మీటర్లు విసరాలి. ఒకొకరికీ మూడు అవకాశాలుంటాయి. ఇందులో ఒకసారి లక్ష్యం ఛేదించినా తదుపరి ఈవెంట్కు అర్హత సాధించినట్టే. ఈ విభాగంలో ఇప్పటి వరకు పురుషుల్లో 25 శాతం, మహిళల్లో 42 శాతం మంది విఫలమయ్యారు. చివరి ఘట్టం లాంగ్జంప్లో పురుషులు-4 మీటర్లు, ఎక్స్ సర్వీస్మెన్- 3.50 మీటర్లు, మహిళలు-2.50 మీటర్ల చొప్పున కనీస దూరం దూకి అర్హత సాధించాలి. ఈ విభాగంలో పురుషుల్లో 65 శాతం మంది, మహిళల్లో 76 శాతం మంది అర్హత సాధిస్తున్నారు.
పోలీసు ఉద్యోగ నియామకాల ఎంపికలో మహిళా అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఈవెంట్లలో మొదటి రెండు రోజుల్లో పురుషులు హాజరైతే మూడో రోజు పరీక్షలకు మహిళలు వచ్చారు. తుది రాత పరీక్షకు అర్హత సాధించిన వారిలో పురుషుల కంటే మహిళలే ఎకువ ఉంటుండటం విశేషం. ఇప్పటి వరకు పరీక్షలకు హాజరైన పురుషుల్లో 60 శాతం మంది అన్ని ఈవెంట్లలో విజయం సాధిస్తే.. మహిళలు 70 శాతం వరకు అర్హత సాధించి శభాష్ అనిపించుకున్నారు. పురుష అభ్యర్థుల ఈవెంట్లు ఇంకా కొనసాగుతున్నాయి.
శారీరక దారుఢ్య పరీక్షల సందర్భంగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐల పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య ఎంపికలు కొనసాగుతున్నాయి. మైదానం పరిసరాల్లో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ తెల్లవారు జామున 4 గంటలకే మైదానానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. పరుగు, ఎత్తు, లాంగ్జంప్, షాట్పుట్ వంటి ఈవెంట్లను దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నారు. ఎవరు ఏ ఈవెంట్లో అర్హత సాధించలేదో గుర్తించి వారిని అప్పటి నుంచే డిస్ క్వాలిఫై చేస్తూ బయటకు పంపిస్తున్నారు.
పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ైస్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 18వ రోజు గురువారమూ ఈవెంట్లు కొనసాగినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలకు 1,263 మంది హాజరు కావాల్సి ఉండగా 1,088 మంది హాజరైనట్లు చెప్పారు. వీరిలో 646 మంది అభ్యర్థులు తుది పరీక్షలకు అర్హత సాధించినట్లు తెలిపారు.
పోలీసు ఉద్యోగాల నియామకాలకు హాజరవుతున్న అభ్యర్థులు మెలకువలు పాటించాలి. దేహదారుఢ్య పరీక్షల్లో విజయం సాధించాలంటే ముందు నుంచే నిరంతర సాధన అవసరం. అదే సమయంలో మెలకువలు పాటిస్తే మిగతా వారి కంటే ముందుండే విజయం సాధించే అవకాశం ఉంది. పురుషులతో పోల్చితే మహిళా అభ్యర్థులే ఎకువగా అర్హత సాధిస్తున్నారు. పురుష అభ్యర్థుల ఎంపికలు 2023 జనవరి 3 వరకు కొనసాగనున్నాయి.
-విష్ణు ఎస్ వారియర్, సీపీ, ఖమ్మం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోలీస్ నియామకాల ఎంపికలో పురుషుల ఈవెంట్లలో అనుసరిస్తున్న విధానం చాలా బాగుంది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో మంచి సాధన చేసిన అభ్యర్థులే ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టుల్లోనూ అర్హత సాధిస్తున్నారు. సాధన లేని, మెళకువలు పాటించని అభ్యర్థులు రన్నింగ్, షాట్ఫుట్, లాంగ్జంప్ వంటి ఈవెంట్లలో అర్హత సాధించలేకపోతున్నారు. ఈ పోలీసు నియామకాల ఎంపికల్లో ప్రతిభ చూపిన వారే తదుపరి ఈవెంట్లకు వెళ్తున్నారు. పోలీసు వృత్తిలో కఠినమైన దేహదారుఢ్య పరీక్షలు ఎంతో కీలకం. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఉండాల్సిందే.
-ఏ.ప్రవీణ్, కానిస్టేబుల్ ఈవెంట్లో ఎంపికైన అభ్యర్థి
పోలీసు ఉద్యోగాలకు ఫిజికల్ సామర్థ్యం ఎంతో ముఖ్యం. ఈ ఉద్యోగం నిత్యం చాలెం జింగ్తో కూడుకున్నది. కాబట్టి అభ్యర్థులు మొదటి నుంచే ఫిజికల్ ఫిట్నెస్పై దృష్టి సారించాలి. చదువు మీద దృష్టి పెడుతూనే ఫిజికల్ ఫిట్నెస్నూ సాధన చేయాలి. చాలామంది సాధన లేకుండా నేరుగా ఈవెంట్స్కు వస్తున్నారు. అలాంటి వారంతా ఈ శరీర సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించలే పోతున్నారు. కానిస్టేబుల్గా పనిచేస్తున్న నేను.. ఎస్ఐ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నాను. నా కుమార్తె త్రిలోకిని కూడా పోలీసు ఉద్యోగ సాధనే లక్ష్యంగా శ్రమిస్తోంది. ఇద్దరమూ కలిసి ఈవెంట్స్లో సత్తా చాటి ఎంపికయ్యాం.
-నాగమణి, త్రిలోకిని, ఈవెంట్స్లో అర్హత సాధించిన తల్లీకూతుళ్లు