బొమ్మలరామారం, జనవరి 21 : మండలంలో 8వ విడుత హరిత హారానికి నర్సరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 34 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. 1 నుంచి 6వ విడుత వరకు 2లక్షల మెక్కలు, 7వ విడుతలో 2లక్షల 25వేల మొక్కలు నాటారు. 8వ విడుతకు 3.96లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మొక్కల పెంపకానికి నర్సరీలను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 2లక్షల బ్యాగులను మట్టితో నింపారు. 3.96 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
3.96 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
మండలంలోని 34గ్రామ పంచాయతీల్లో 3.96 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అన్ని నర్సరీలకు మట్టి, విత్తనాలు, కవర్లు అందజేశాం. బ్యాగుల్లో మట్టి నింపడం పూర్తి కావచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం.
మొక్కలు సిద్ధం చేస్తున్నాం
ఎనిమిదవ విడుత హారిత హారంలో నాటడానికి మొక్కలు సిద్ధం చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రజలు ఇంట్లో నాటుకోవడానికి అవసరమయ్యే పండ్లు, పూల మొక్కలు కూడా పెంచుతున్నాం. నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.