ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రంజాన్ పర్వదినం వేడుకలను ముస్లిములు ఘనంగా జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈద్-ఉల్- ఫితర్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాన్సువాడలో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పాల్గొని ముస్లిములకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిములు సోమవారం సాయంత్రం విరమించారు.