మోర్తాడ్, మే 13: భూమిని సారవంతం చేసేందుకు రైతులు ఏటా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వేసవి దుక్కుల తర్వాత ఈ సేంద్రియ ఎరువులు భూమిపై చల్లుతారు. దీంతో భూమి సారవంతమై పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో గొల్లేరును ఎక్కువగా వాడుతుంటారు. అయితే దీని ధర ఏటా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పెరుగుతూనే ఉన్నది. అన్నిరకాల ఎరువుల ధరలు పెరుగుతున్నా పంటలకు గిట్టుబాటు ధరలు మాత్రం రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గొల్లేరు ధర ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ఒక లారీ గొల్లేరును రూ.27వేలతో రైతులు కొ నుగోలు చేస్తున్నారు. ఈ ధర వారం పదిరోజుల తర్వాత రూ.30వేల వర కు దాటుతుందని రైతులు అంటున్నా రు. దీని ధర గత సంవత్సరం ఆరంభంలో రూ.24వేల నుంచి ప్రారంభమై రూ.30వేల వరకు కొనసాగిం ది. ఈ సంవత్సరం ఆరంభంలో రూ. 27వేలకు ప్రారంభమై డిమాండ్ పెరి గే కొద్ది రూ.32 వేల వరకు వెళ్లవచ్చని అంటున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర వస్తే బాగుంటందన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.