డిచ్పల్లి, మే 13: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులకు చెందిన రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎం.అరుణ తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన మూడో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 2200 మంది నమోదు చేసుకోగా, 2039 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ఐదో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం ఐదుగురు నమోదు చేసుకోగా అందరూ హాజరైనట్లు తెలిపారు. టీయూలోని ప్రధాన ప్రాంగణంలో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఉపకులపతి ఆచార్య డి.రవీందర్గుప్తా తనిఖీ చేశారు.
టీయూలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండు, మూడో సంవత్సరం వైన్టైం ఛాన్స్ బ్యాక్లాగ్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎం.అరుణ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రెండో సంవత్సరం బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 294 మంది నమోదు చేసుకోగా 270 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.