రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తుండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. దీంతో విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం కామారెడ్డి జిల్లాలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మరోవైపు నకిలీ విత్తనాల కేసుల పరిష్కారానికి ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నది.
కామారెడ్డి, మే 12 : వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. దీంతో విత్తనాలకు డిమాండ్ పెరుగుతున్నది. ఇదే అదునుగా భావించి వివిధ కంపెనీల పేరుతో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందు లో భాగంగా కామారెడ్డి జిల్లాలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. పోలీసు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేయనున్నారు.
గతేడాది కామారెడ్డి జిల్లా లో నకిలీ పత్తి, మక్కజొన్న విత్తనాలతో పలువురు రైతులు నష్టపోయారు. రైతుల పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో విత్తన డీలర్లు ఏయే కంపెనీల విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నారు.. ఎంత స్టాక్ ఉన్నది… ఎవరికి అమ్ముతున్నారనే వివరాల నమోదుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు నకిలీ విత్తనాల కేసుల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న వర్షాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు రాకుండా అడ్డుకట్టకు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
పంటల సాగు విషయంలో విత్తనమే పునాదిగా భావించి నాణ్యమైన విత్తనాలను రైతులకు ప్రభుత్వపరంగా, ప్రైవేట్పరంగా అందించాలనే ప్రయత్నాలు చే స్తున్నారు. రైతులందరికీ నాణ్యమైన విత్తనాలను అందించేందుకు సర్కార్ నూతన విధానాన్ని అమలు చేస్తుండగా ఇందులో ముఖ్యంగా విత్తనాల డీలర్లపై ప్రత్యేకంగా నిఘా పె ట్టారు. ఎరువులు, విత్తనాల స్టాక్ వివరాలు ఆన్లైన్లో నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నదాతలకు నష్టం కలిగించే వారెవరినీ క్షమించేది లేదని రాష్ట్రప్రభుత్వంఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
వివిధ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను రైతుల కు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధిక లాభాలకు ఆశపడి డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా వాటిని రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో సాగు చేసిన రైతులు దిగుబడులు రాక నష్టపోతున్నారు. అక్రమాలకు పాల్పడే డీలర్లకు చెక్పెట్టి అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆన్లైన్ విధానాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా అధికారులు, డీలర్లకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకు నకిలీ విత్తనాలు పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కేసులు నమోదైన డీలర్ల వివరాలను అధికారులు సేకరించేందుకు సిద్ధం అయ్యారు.
కామారెడ్డి జిల్లాలో వరి, మక్కజొన్న, పత్తి, సో యాబీన్, పొద్దుతిరుగుడు తదితర పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ప్రతి వానకాలం సీజన్లో పంటల సాగు పెరుగుతూ వస్తున్నది. వానకాలం నుంచి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇందుకోసం రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువుల వివరాలు, స్లాట్ నంబ ర్, కంపెనీ, రసీదు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి. తద్వారా ఏ డీలర్ నుంచి విత్తనాలు కొనుగోలు చేశారనే విషయం ఇట్టే తెలిసిపోతుంది.
రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు మొలకెత్తకపోయినా, దిగుబడి రాకపోయినా డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉం టుంది. విత్తన ప్యాకెట్లపై సరైన పేరు, గడువు తేదీ, బార్ కోడ్ లేని విత్తనాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పకుండా బిల్లులు తీ సుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. అనుమతు లు లేకుండా విత్తనాలు విక్రయిస్తే పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నది.
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ విధానం ఎంతగానో దోహదపడుతుంది. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై నేరుగా చర్యలు తీసుకునే ఆవకాశం ఉంటుంది. నకిలీ విత్తనాలు అమ్మిన, అక్రమంగా రవాణా చేసిన వారిపై , డీలర్లపై చర్యలు తీసుకుంటాం. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా సీడ్ కార్పొరేషన్తో పాటు విత్తన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతూ కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి.
– భాగ్యలక్ష్మి, వ్యవసాయ అధికారిణి,కామారెడ్డి