నిజామాబాద్ లీగల్, మే 11 : ట్రాన్స్జెండర్ల విద్యాబుద్ధులు, ప్రతిభా పాటవాలు పేరెన్నిక గలవని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు. జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యాలయంలో ట్రాన్స్జెండర్ అసది అలకను ఆఫీస్ సబార్డినేట్గా నియమించిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2014 కేసులో భారత సుప్రీం కోర్టు ట్రాన్స్జెండర్ల హక్కులకు, ఉద్యోగ కల్పనకు అనుకూలంగా తీర్పు వెలువరించిందని తెలిపారు. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి సతీశ్చంద్ర శర్మ, రాష్ట్ర హైకోర్టు జడ్జి ఉమ్మడి జిల్లా ఫోర్ట్ పోలియో జడ్జి విజయ్సేన్రెడ్డి, రాష్ట్ర న్యాయసేవా సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్రెడ్డి సంపూర్ణ సహాయ సహకారాలతో అలక నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయగలిగామన్నారు.
జిల్లా జడ్జి : వారితో నిర్వహించిన సదస్సులు, సమావేశాలు, మాటామంతితో వారిలో ఉన్న విద్యార్హతలు, చైతన్యశీలతలే దోహదకారిగా నిలిచాయి.
కచ్చితంగా విద్యార్హతలను బట్టి వారిలో మరికొందరికి అవకాశం ఉంటుంది. ఒక అడుగువేశాం. మున్ముందు మరిన్ని అడుగులు వేసి ఆచరిస్తాం.
న్యాయవ్యవస్థ ఒక తోవ చూపింది. మిగతా ప్రభుత్వ శాఖలు అనుసరిస్తాయనే ఆశాభావం ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు ఫోన్ కాల్ ద్వారా అభినందనలు తెలిపి ట్రాన్స్జెండర్ల నియామకాలకు తోడ్పాటు అందిస్తామని చెప్పారు.
ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యతను తీసుకున్నాం. ప్రభుత్వ విభాగాలు సహకరిస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించడానికి న్యాయ సేవా సంస్థ సహకారమందిస్తున్నది.
జాతీయ న్యాయసేవాప్రాధికార సంస్థ భారత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసులో వారికి సమానహక్కులు ఉండాలని, లింగ వివక్ష ఉండరాదని తీర్పు చెప్పింది. అందుకు అనుగుణంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్ 2019 లాంటి చట్టాల ద్వారా సాధించగలిగాం.
ఒక ట్రాన్స్జెండర్ అనే కాదు అన్ని వర్గాల ప్రజల చట్టబద్ధమైన హక్కుల కోసం, సంక్షేమం కోసం న్యాయసేవా సంస్థ కృషిచేస్తున్నది. పౌర సమాజం మరింత సహకరిస్తే సమాజ వికాసానికి ప్రభుత్వ విభాగాల చేయూతను ఆశిస్తున్నాం.