పరారీలో మరొకరు
23 మోటరు సైకిళ్లు స్వాధీనం
కామారెడ్డిలో అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
నిజామాబాద్లోని పలు ప్రాంతాలతో పాటు నిర్మల్లోనూ కేసులు
ఇందూరు, ఆగస్టు 22 : నిజామాబాద్ నగరంలో ముగ్గురు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేసి 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వెంకటేశ్వర్లు, టౌన్ సీఐ సత్యనారాయణ, నాల్గో టౌన్ ఎస్సై సందీప్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిజామాబాద్కు చెందిన కొర్రల గంగాధర్ అలియాస్ గంగా అలియాస్ అబ్దుల్ రహమాన్, అస్లాం ఖాన్ పఠాన్, సోహెల్ అలియాస్ చోటుతో పాటు మరో బాలుడు ముఠాగా ఏర్పడ్డారు. నిజామాబాద్ నగరంతో పాటు డిచ్పల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డారు. ఇండ్ల ముందు పార్క్ చేసిన వాహనాలే వీరి టార్గెట్. ఈ విధంగా మొత్తం 23 ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. చోరీ చేసిన వాహనాలను ఒక్కొక్కటిగా అమ్ముకోవాలని పథకం రచించారు. ఇందులో భాగం గా రహమాన్, అస్లాం ఖాన్ పఠాన్తో పాటు ఓ బాలు డు ఆదివారం రహమాన్కు చెందిన ఆటోలో ఒక బైక్ ను కామారెడ్డిలో అమ్మేందుకు బయల్దేరారు. వాహనా ల తనిఖీలో భాగంగా అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా నేరం ఒప్పుకున్నారు. బైక్ను తరలించడానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నింది తుడు చోటు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ నాల్గో టౌన్ పరిధిలో మూడు కేసులు, మూడో టౌన్ పరిధిలో మూడు, రెండో టౌన్ పరిధిలో రెండు, మాక్లూర్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కేసులు, డిచ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కేసులు, ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు కేసులు, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, నిర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు.. మొత్తం 17 కేసులు నమోదైనట్లు ఏసీపీ తెలిపారు. మిగతా 6 మోటర్ సైకిళ్లకు సంబంధించిన వివరాలు తెలియరాలేదన్నారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర వహించిన టౌన్ సీఐ సత్యనారాయణ, నాల్గో టౌన్ ఎస్సై సందీప్, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ సుభాష్, వెంకట్రామ్ను సీపీ కార్తికేయ అభినందించారు.