యాదాద్రి, జనవరి 19 : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు చేశారు. మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు. లక్ష్మీనారసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, కల్యాణం, అలంకార సేవోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు, కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు, అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. అన్ని విభాగాలు కలిపి శ్రీవారి ఖజానాకు రూ.7,29,462 సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారి సేవలో చీఫ్ విప్ వినయ్భాస్కర్
శ్రీవారిని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు బాలాలయంలో స్వామి సువర్ణ పుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బాలాలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం ఇవ్వగా, అధికారులు స్వామి ప్రసాదం అందజేశారు.
స్వామి వారికి వెండి సామగ్రి
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ బంధువులు స్వామివారి నిజాభిషేకానికి వినియోగించే వెండి సామగ్రి అందించారు. హైదరాబాద్కు చెందిన ఎన్.వెంకటాచలపతి, సత్యశ్రీ 395గ్రాముల వెండి అభిషేక చెంబు, హైదరాబాద్కు చెందిన గీత భాస్కర్, తరుణ్ భాస్కర్ 385గ్రాముల వెండి, గద్వాల్కు చెందిన సాయికృష్ణ 380గ్రాముల వెండి అభిషేక చెంబులను ఆలయ అధికారులకు అందించారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 51,500
రూ. 100 దర్శనం టిక్కెట్ 12,000
వేద ఆశీర్వచనం 6,000
నిత్యకైంకర్యాలు 2,200
ప్రచారశాఖ 8,000
క్యారీబ్యాగుల విక్రయం 2,750
వ్రత పూజలు 40,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 19,200
ప్రసాద విక్రయం 4,08,000
వాహనపూజలు 2,800
టోల్గేట్ 820
అన్నదాన విరాళం 17,732
సువర్ణ పుష్పార్చన 59,800
యాదరుషి నిలయం 45,880
పాతగుట్ట నుంచి 20,480