నల్లగొండ, మే 12 : గుడ్ గవర్నన్స్కు సంబంధించిన పనులపై అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో శానిటేషన్, డంపింగ్ యార్డ్, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. వాటర్ షెడ్లు, వైకుంఠధామాల పురోగతి, లేబర్ మొబిలైజేషన్, నర్సరీల పురోగతి, మెటీరియల్ పేమెంట్లపై మండలాల వారీగా సమీక్షించారు.
త్వరలో కేంద్ర కమిటీ గుడ్ గవర్నెన్స్కు సంబంధించి పనుల ప్రగతిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్న నేపథ్యంలో ఆయా పనులకు సంబంధించి వారికి అర్థమయ్యే రీతిలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పనులకు సంబంధించి ఏడు రిజిస్టర్లు నిర్వహించాలని తెలిపారు. సీఆర్ రికార్డులు ఈఈకి పంపాలని, వాటర్ షెడ్స్ కోసం అటవీ, పీఆర్ అధికారులతో చర్చించాలని, వాటర్ ట్యాంకుల నిర్మాణం కోసం రైతుల అంగీకారం తీసుకోవాలని తెలిపారు. మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని పాల్గొన్నారు.