చంపాపేట : నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఆదివారం చంపాపేట డివిజన్ పరిధి న్యూ మారుతీనగర్ కాలనీ వాసులు తమ కాలనీలో పార్కు ఏర్పాటు చేయాలని, అంతే కాకుండా మంద మల్లమ్మ చౌరస్తా దగ్గర ఉండే రోడ్డు యూటర్ను మూసివేసి తమ కాలనీ సమీపంలో యూటర్న్ ఏర్పాటు చేయడం మూలంగా వాహనాలన్నీ తమ కాలనీ వీదుల్లోంచే వెలుతున్నాయని, దీంతో తమ కాలనీలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.
కాలనీలో ఇతర సమస్యలు పరిష్కరించాలని టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి సమక్షంలో కాలనీ వాసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో కలిసి వివరించినట్లు రాజ్కుమార్ రెడ్డి ఒక్క ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యే స్పందించి న్యూ మారుతీనగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తానని, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలియజేసినట్లు రాజ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తలారి సత్యప్రకాశ్, కాలనీ వాసులు డాక్టర్ భువనేశ్వర్ రావు, కృష్ణ, రిషి తదితరులు పాల్గొన్నారు.