జూబ్లీహిల్స్ : విద్యార్థులు బాల్యంనుంచే విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ అండర్-15 ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించిన లోచిత బుధవారం కోచ్ శ్రీకాంత్ యాదవ్, తండ్రి అజ్జు తో కలిసి మంత్రిని కలిశారు. చిన్ననాటి నుంచి రెజ్లింగ్లో ప్రతిభ కనబరుస్తున్న లోచితను మంత్రి సబితా రెడ్డి అభినందించారు.