పరకాల, ఏప్రిల్ 9: ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల గుర్తింపుకోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తిరునహరి శేషాంజన్స్వామి వివిధ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. 9వ వార్డు ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. అనంతరం పట్టణంలోని జూనియర్ కళాశాల భవనంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో పార్టీల నాయకులు బండి సారంగపాణి, భిక్షపతి, నిరంజన్, పురుషోత్తం, దుప్పటి సాంబయ్య, పసుల మణికంఠ, ప్రవీణ్ పాల్గొన్నారు.
ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
పట్టణంలోని 9వ వార్డు ఉపఎన్నికలో భాగం గా ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. అభ్యంతరాలు ఒకటి మా త్రమే వచ్చిందని, దానిపై విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రక్తపు మడుగులో ఎన్నారై భార్యాభర్తలు
ఓపెన్ జిమ్ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు