బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పేదల కోసం మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్ట నున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. డివిజన్లో మల్టీ పర్పస్ నిర్మాణం చేయాలంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
దీనికి మంత్రి కేటీఆర్ అంగీకరించడంతో స్థలాన్ని గుర్తించేందుకు బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, షేక్పేట మండల తహసీల్దార్తో కలిసి పర్యటించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని, సింగాడబస్తీ ఎగువ భాగంలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు.
అన్ని హంగులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు సిద్దంగా ఉన్నామని, స్థలం ఖరారు కాగానే నిధులు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.