చిక్కడపల్లి : సీఎం ఆర్ఎఫ్కు ధరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ లబ్ధిదారులకు అందజేశారు.
లబ్ధిదారులు నర్సింహకు 26వేల, శివ శంకర్ 34వేలు, మధుకర్కు 60వేలు, రాధకు 36వేల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సేవలను అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో తోడ్పాటును అందిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, పరుశురాం, మారిశెట్టి నర్సింగ్ రావు, ఆకుల శ్రీనివాస్,జి.వెంకటేశ్, నర్సింగ్, సుధాకర్, జహంగీర్, గడ్డమీది శ్రీనివాస్, పద్మ సూర్యప్రకాశ్, ప్రేమ్, నరసింహ మూర్తి, సంతోష్, తుడుం లక్ష్మి, సుధా బాగ్యలక్ష్మి, ముఠా శివసింహ,శివసాయి, పి.రాజ్కుమార్, హనుమంతు, బి.కిరణ్కుమార్, ఎం.సురేశ్, తదితరులు పాల్గొన్నారు.