ఎరగడ్డ : ఎర్రగడ్డ డివిజన్లో రూ.15.5 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఇందులో సంజయ్నగర్, బి.శంకర్లాల్నగర్ బస్తీల్లో సివరేజీ పైప్లైన్ పనులు, న్యూ సుల్తాన్నగర్లో తాగునీటి పైప్లైన్ పనులున్నాయి.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి చేసి సమస్యలు లేని డివిజన్గా ఎర్రగడ్డను తీర్చిదిద్దటానికి కట్టుబడి ఉంటానన్నారు. అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ దక్కేలా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణ అన్ని అంశాల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డి.సంజీవ, కార్యదర్శి షరీఫ్ఖురేషీ, నేతలు గంట మల్లేష్, మహ్మద్సర్దార్, రాము, మహ్మద్అహ్మద్, ముస్తాక్, అజీమ్, సయ్యద్రసూల్ తదితరులు పాల్గొన్నారు.