బన్సీలాల్పేట్ : టీఆర్ఎస్ నాయకులు మిట్టపల్లి బాబురావు, జగ్గయ్యల తల్లి ఎం.లింగమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పద్మారావునగర్లోని బాబురావు నివాసానికి వెళ్ళి లింగమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, జి.పవన్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.