బడంగ్పేట : తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్కు ఎంపికైన డాక్టర్ శ్రీజను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు.
నగరంలోని ఉప్పల్ చిలుకానగర్లో నివాసముంటున్న శ్రీజ ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తూనే దేశంలో అత్యున్నత సివిల్ సర్వీస్కు ఎంపికై త్వరలో శిక్షణకు వెళ్లనున్న సందర్భంగా సోమవారం బషీర్బాగ్లోని విద్యాశాఖ కార్యాలయంలో మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీజను మంత్రి అభినందించి, భవిష్యత్లో మరింత రాణించాలన్నారు. శిక్షణలో మంచి ప్రతిభ చూపి తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, పుట్టిన గ్రామానికి పేరు నిలబెట్టాలన్నారు. దేశంలోనే 20వ ర్యాంకు సాధించటం ఎంతో గొప్ప విషయమన్నారు. యువతరానికి శ్రీజ విజయం ప్రేరణ ఇస్తుందన్నారు.