‘తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ‘మన నగరం’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున అసైన్డ్, రిజిస్ట్రేషన్ భూముల సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వాస్తవానికి సామాన్యులు లక్షల రూపాయలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్న దరిమిలా వాటికి ప్రభుత్వపరంగా ఒక పరిష్కారం చూపడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సైతం ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు. దీంతో సమస్య సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడం… మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ అన్ని కోణాల్లో సమస్యను పరిశీలించి.. పరిష్కారాన్ని చూపడం జరిగిపోయాయి. రెండ్రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ భూముల సమస్యకు పరిష్కారాన్ని చూపుతూ ఆమోద ముద్ర వేశారు.
నగరంలో ఎల్బీనగర్ నియోజకవర్గం అత్యంత కీలకమైంది. ఇక్కడ నాగోల్, మన్సూరాబాద్, హయత్నగర్, చంపాపేట, హస్తినాపురం, బీఎన్రెడ్డి నగర్ తదితర డివిజన్లలో వందలాది కాలనీలు ఉన్నాయి. అయితే ఇందుల్లో కొన్ని సర్వే నంబర్లలోని భూములు వాస్తవానికి అసైన్డ్ భూములు కాగా, మరికొన్ని కొందరు అధికారుల తప్పిదంతో ఆ జాబితాలోకి వెళ్లాయి. దీంతో పాటు మరికొన్ని భూములు అటవీ, ఇతరత్రా కోణాల్లో వివాదాల్లో చిక్కుకోవడంతో దశాబ్దాలుగా ఈ భూముల్లో రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. అయినప్పటికీ ఆ భూముల్లో వెంచర్లు వేయడం, సామాన్యులు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవడమనేది దశాబ్దాలుగా కొనసాగింది. తద్వారా ఇప్పుడు భారీ కాలనీలుగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములు చేతులు మారి, వెంచర్లు వెలిసినట్లయితే తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ భూములన్నీ కాలనీలుగా మారడంతో లక్షలాది మంది సామాన్యులు తీవ్రంగా నష్టపోతారు. దీంతో ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోకపోగా… ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడం లేదు. రెండున్నర, మూడు దశాబ్దాల కిందటే తెరపైకొచ్చిన ఈ సమస్యలపై అప్పటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు దృష్టిసారించలేదు.
తదుపరి మార్గదర్శకాల్లో స్పష్టత..
మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిన ఈ సమస్య పరిష్కారంలో భాగంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎలా ఉంటుందనే దానిపై తదుపరి మార్గదర్శకాల్లో స్పష్టత రానుందని అధికారులు తెలిపారు. ఈ భూముల్లో రిజిస్ట్రేషన్ల అనుమతికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ కానున్నట్లు తెలిసింది. తద్వారా ఇకపై ఈ భూముల్లో రిజిస్ట్రేషన్లకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. అయితే ఇప్పటివరకు నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి క్రమబద్ధీకరణపై సమగ్ర మార్గదర్శకాలతో అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయి. ఆపై సామాన్యులు కట్టుకున్న ఇళ్లకు భరోసా లభించడంతో ఇకపై వారు చెల్లించే పన్నులు, జరిగే రిజిస్ట్రేషన్ల లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం రానుంది.
లబ్ధి పొందే కాలనీలు ఇవే..
నాగోలు డివిజన్లోని సాయినగర్, అరుణోదయనగర్, కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, లలితానగర్ పార్ట్, శ్రీ సాయినగర్ డెవలప్మెంట్ సొసైటీ, శ్రీ గణేశ్నగర్, శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈశ్వరిపురి కాలనీ సర్వే నంబర్ 87/1 నుంచి 87/6 వరకు, మల్లికార్జున హిల్స్ 11 ఎకరాలు, అవనీ హోం, లలితానగర్, ఫతుల్లాగూడ సర్వే నంబర్ 2/1 నుంచి 2/ 16 వరకు అసైన్డ్ భూములు.
మన్సూరాబాద్ డివిజన్ బాలాజీనగర్ (సర్వే నంబర్ 91,92), త్యాగరాయనగర్ (సర్వే నంబర్ 93, 94) శ్రీరాంనగర్ (సర్వే నంబర్ 97), కేవీఎన్రెడ్డి నగర్ (సర్వే నంబర్ 96/2, 95, 95ఏ), వినాయకనగర్ ఫేజ్ 2 (సర్వే నంబర్ 72,73), ఆర్టీసీ కాలనీ (సర్వే నంబర్ 41, 42), ఎల్లారెడ్డి కాలనీ (సర్వే నంబర్ 92,94,) బీసీ కాలనీ ( సర్వే నంబర్ 195/2), లెక్చరర్స్ కాలనీ (సర్వే నంబర్ 90), బ్యాంక్ కాలనీ పార్టు (సర్వే నంబర్ 12,14 ), కాస్మోపాలిటన్ కాలనీ (సర్వే నంబర్ 16,17)
హయత్నగర్ డివిజన్లోని వినాయకనగర్ (సర్వే నంబర్ 40,41,73), విజయనగర్ కాలనీ (సర్వే నంబర్ 114, నాలుగు ఎకరాలు), అన్మగల్ హయత్నగర్ తెలంగాణ పద్మావతి కాలనీ, సాహెబ్నగర్ కలాన్ విజయనగర్ కాలనీ
(సర్వే నంబర్ 71/2, 71/3)
చంపాపేట డివిజన్లోని ఈస్ట్ మారుతీనగర్
(సర్వే నంబర్ 11,12,13,14), శ్రీనిధి కాలనీ,
పద్మానగర్ (సర్వే నంబర్ 226 నుండి 229 వరకు), చంపాపేట శ్రీ వెంకటేశ్వర కాలనీ (సర్వే నంబర్ 44,45,46, 47,48,57,58 (12 ఎకరాలు), ఎంఆర్ఆర్ కాలనీ (సర్వే నంబర్ 169 నుంచి 241 వరకు 4 ఎకరాలు), చంపాపేట గ్రామకంఠం సర్వే నంబర్ 13, నుంచి 18 వరకు, 27 గ్రామకంఠం) సుల్తాన్ వల్వ (సర్వే నంబర్ 48 నుంచి 56 వరకు), మాధవనగర్, డిఫెన్స్ కాలనీ, ఎస్వీ కాలనీ
హస్తినాపురం డివిజన్లోని జనార్దన్రెడ్డి కాలనీ
(సర్వే నంబర్ 73/2), నందనవనం (సర్వే నంబర్ 63,71,72), భూపేశ్ గుప్తానగర్ (సర్వే నంబర్ 73/1), ఇంద్రసేనారెడ్డినగర్ (సర్వే నంబర్ 63), సుభాష్ చంద్రబోస్ కాలనీ గ్రామకంఠం, ఖాద్రీ కాలనీ, ధాతూనగర్, డీఆర్డీఓ కాలనీ, డీఎంఆర్ఎల్ కాలనీ, ఆర్సీఐ కాలనీ, ఏఆర్సీఐ కాలనీ, బీడీఎల్కాలనీలు
బీఎన్రెడ్డినగర్ డివిజన్లోని వైదేహీనగర్, ఎస్కేడీనగర్, బీఎన్రెడ్డినగర్, శ్రీరాంనగర్, సాగర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీ (సర్వే నంబర్లు 200, 201/1 201/2, 201/3 మొత్తం 600 ఎకరాలు )