రామచంద్రాపురం, ఆగస్టు 16: హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పుష్పానగేశ్ అన్నారు. సోమవారం ఆర్సీపురం డివిజన్లోని పోలీస్ క్వార్టర్స్లో బల్ది యా ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పుష్పానగేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం పోలీస్ క్వార్టర్స్లో 400 వేప, మామిడి తదితర మొక్కలను నాటారు. డీసీపీ మాట్లాడుతూ హరితహారంతో రాష్ట్రం పచ్చగా మారుతుందన్నారు. పోలీస్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున్న మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలందరూ వారి ఇంట్లో మొక్కలు నాటాలని సూచించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో హరితహారానికి శ్రీకారం చుట్టారని, ఆరు విడతల్లో నాటిన మొక్కలతో అడవుల శాతం మెరుగుపడిందన్నారు. ఇంటికి ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపకమిషనర్ బాలయ్య, ఏఎంవోహెచ్ డాక్టర్ రనజిత్సింగ్, ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్, ఎస్సై కోటేశ్వర్రావు, నాయకులు శ్రీనివాస్రాజు, సత్తిరెడ్డి పాల్గొన్నారు.